ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లోని ఐ పోలవరం మండలం లోని పూర్వ నామం ‘ముని మండలి’ గా ఉన్న ప్రస్తుత వ్యవహారనామం ‘మురమళ్ళ గ్రామంలో కొలువైఉన్న దక్షయజ్ఞం వృత్తాంతానికి
సంబంధించిన పరమపవిత్ర పుణ్యక్షేత్రం వివాహం కానివారికి, వివాహం లో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారికి మురమళ్ళ మొక్కు పేరుతో స్వామి వారికి, అమ్మవారితో నిత్యం సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగే కల్యాణం చేయించడం ద్వారా అదీ భక్తుల జన్మనక్షత్రం ప్రకారం ముందుగా ఆలయం నిర్ణయించిన తేదీకి జరిపిస్తే మొక్కుతీర్చిన భక్తుని లేదా భక్తురాలి వివాహం జరిగేందుకు తమ కృపను వర్షించి మొక్కును ఫలవంతం చేస్తూ వివాహం జరిగేందుకు అనుగ్రహాన్ని అందిస్తూ ఎందరో భక్తుల ఇతర కోరికలను సైతం తమ కల్యాణం తో విజయవంతం చేస్తున్న “నిత్య కళ్యాణం-పచ్చ తోరణం ” గా పేరొందిన శైవక్షేత్రం “శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి” దర్శనం శివసంకల్పం లో ఈరోజు….
“మురమళ్ళ” మొక్కు తప్పదు :
ఇది ఈశ్వర శాసనం.. భక్తుల అనుభవసారం అవివహితులుగా స్వామి కల్యాణం లో పాల్గొన్న ఎందరో ఏడాదిలోపు వివాహం జరిగి దంపతయుక్తంగా కల్యాణం లో పాల్గొనడం రెండు తెలుగురాష్ట్రాల లోనే కాదు భారతదేశవ్యాప్తంగా ఉన్న ఎందరికో జరిగిన నిదర్శనం..
మురమళ్ళ మొక్కు తప్పదు అంటే అనుకున్నది తప్పకుండా జరిగితీరుతుంది అని మరియు లక్ష్యం పై ఉంచిన గురి తప్పదు అని భక్తుల హృదయస్పందన.
స్వామివారి కల్యాణం కోసం ఆలయ చరవాణి :
సేకరించిన సమాచారం ప్రకారం
కార్యాలయ ఫోన్:
08856-278424
08856-278136
ఈ నెంబర్ లలో సంప్రదించి తేదీ నిర్ణయించుకోవచ్చు… కల్యాణం మొక్కు కోసం
అమ్మ, అయ్యకు కల్యాణంవిశిష్టత :
శివయ్య ఆగ్రహం- వీరభద్ర ఆవిర్భావం :
సతీదేవి భస్మమవటంతో కోపించిన శివుడు వీరభద్రుడుని సృష్టించి దక్షయజ్ఞ వినాశనానికి పంపుతాడు. ఆయననే ఇక్కడ వీరేశ్వరుడంటారు. ఆయన మహా భయంకర రూపందాల్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు.
అమ్మవారు ప్రత్యక్షమై విషయం తెలుసుకుని, తన షోడశ కళలలోని ఒక కళ భద్రకాళిని వీరభద్రుని శాంతింపచెయ్యటానికి భూలోకానికి పంపింది. భద్రకాళి అమ్మవారు ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడావిడ శరభ అశ్శరభ అంటూ పక్కనే వున్న తటాకంలో మనిగి కన్యరూపం దాల్చి తటాకమునుండి బయటకువచ్చి వీరేశ్వరుని చూసింది.
శాంతించిన వీరేశ్వరుడు : కన్యరూపంలోవున్న భద్రకాళిని చూసి వీరేశ్వరుడు శాంతించాడు. ఇదంతా జరిగింది మహామునులందరూ గౌతమీ తటంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని నివసిస్తున్న ప్రదేశంలో. ఈ ప్రదేశాన్ని మునిమండలి అనేవారు.
స్వామివారికి అమ్మవారితో కల్యాణం:
ముని మండలే నేటి మురమళ్ళ :
*మురమళ్ళ అప్పటినుంచి ఆ క్షేత్రంలో స్వామికి నిత్యం గాంధర్వ పధ్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ మునిమండలే కాలక్రమేణా మురమళ్ళగా నామాంతరం చెందింది.
నిత్య కళ్యాణం :
భక్తులు అలా చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతూంటాయి. అంతేకాదు. స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులేకాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరులనేకులు ప్రతి నిత్యం విచ్చేస్తారని పురాణ కధనం.
కల్యాణ సమయపట్టిక:
నిత్య కల్యాణం పూజ సాయంత్రం 5.00 నుండి ప్రారంభమవుతుంది. ‘అన్నదానం’ పథకం కింద కల్యాణ అనంతరం అన్నప్రసాదం చేయడానికి, కళ్యాణం నిర్వహించడానికి హాజరైన నమోదిత భక్తులు తమ ఉనికిని ఆలయ అధికారులకు సాయంత్రం 5 :00గంటల లోపు తెలియజేయాలి.
నిత్య కల్యాణ ప్రసాదం :
స్వామివారి ప్రసాదం, శేషవస్త్రములు, అక్షింతలు, కుంకుమలు ఆనాటి నమోదిత పాల్గొనే భక్తులందరికీ పంపిణీ చేయబడతాయి. నమోదు చేసుకుని కూడా పాల్గొనలేకపోయినా భక్తుల కోసం స్వామివారి ప్రసాదం, అక్షింతలు మరియు కుంకుమలను కొరియర్ ద్వారా పంపుతుంది దేవస్థానం.. అనంతరం పవళింపుసేవ నిర్వహిస్తారు.
శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి మహిమ, క్షేత్ర మహిమలు స్వయంగా అనుభూతి చెందేందుకు అవకాశంవున్నవారు తప్పక దర్శించవలసిన ఆలయం ఇది…
దర్శనప్రాప్తిని అనుగ్రహించమని శివయ్యను ప్రార్దిద్దాం…
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రం చిదంబరం యాత్రను పూర్తిచేసుకుని ఆనందతాండవపురం చేరుకున్నారు.…
మన భారతీయ సంప్రదాయంలో ప్రతి ఆచారానికీ ఒక అర్ధం ఉంటుంది. అందులో మహిళల జడ కూడా ఒక విశిష్టమైన స్థానం…
తెలుగులో సంవత్సరాలకు ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి, ఇవి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తాయి. ఈ పేర్లు పంచాంగ…
అఖండ భారతావనిలో ఎన్నో విశిష్ట శివాలయాలున్నాయి. వాటిలో మహిమాన్వితమైనవి కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని దేవాలయాలు ఎన్నో విశిష్టతలతో, అంతు…
నిత్య కర్మల్లో దానం ఒకటి. ఇచ్చి పుచ్చుకోవడాలు లోక సహజం. కానీ దానం అలాంటిది కాదు. దానం అనే పదానికి…
కాకి పేరు వినగానే సాదారణంగా చాలా మందికి జుగుప్స కలుగుతుంది. చిరాకు పడతారు. సాధారణంగా చాలామంది పట్టించుకోరు. ఇదీ కాకుల…