
ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారుడు ఖాళీ గా ఉన్నాడా పనిలో ఉన్నాడా అని కనుక్కుని తన వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మన కోసం.
తల్లి… నాయనా! పూజా పురస్కారాలు ఐనాయా..? అని అడిగితే
కుమారుడు… ఇలా చెప్పారు.
అమ్మా! నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు. అలాంటి నేను పూజలు అవి చేయడం.. ఏం బాగోదు.!
అప్పుడా తల్లి మందహాసంతో ఒరే కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసురా. కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నాన్నా… అన్నది.
కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.
అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. నీకు దశావతరాలు అంటే అదే మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా…
కొడుకు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ తల్లి… హా సంబంధం ఉంది. ఇంకా నువు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను అంటూ…
మొదటి అవతారం మత్స్య అవతారం. అంటే చేప అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది.ఇది నిజమా కాదా.
కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.
రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.
మూడవది వరాహ అవతారం. అంటే పంది. ఇది అడవి జంతువులను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.
ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరినామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది.
ఇక ఐదో అవతారం వామన అవతారం అంటే పొట్టివాడు అయిన ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో ఏరెక్టస్ మరియు హోమో సేపియన్స్ అని వున్నారు అని. వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులుగా వికాసం చెందారు.
ఆశ్చర్యం తో ఆ కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.
అప్పుడు ఆ తల్లి కన్నా ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలి ని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఎం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవులలో గుహలలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.
ఇక ఏడో అవతారం రామావతారం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు. సమస్త కుటుంబ బంధుత్వానికి అది పురుషుడు.
ఇక ఎనిమిదవ అవతారం కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు పాలకుడు ప్రేమించే స్వభావి. అతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజములో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు. కొడుకు ఆశ్చర్యం విస్మయం తో వింటున్నాడు.
ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమం లో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణలకు మూలం.
ఇక వచ్చేది కల్కిపురుషుడు. అతను నీవు ఏ మానవునికై వెతుకుతున్నావో అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.
కొడుకు తన తల్లివంక అవాక్కయి చూస్తున్నాడు
అపుడా కొడుకు ఆనంద భాష్పలతో అమ్మ… హిందు ధర్మం ఎంతో అర్థవంతమైనది, అదే నిజమైన ధర్మం అని అన్నాడు.
ఆధ్యాత్మిక వేదిక సభ్యులారా ఆత్మీయులారా !!!
మన వేదాలు , గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇత్యాది అన్ని ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మారాలి. మీరు ఎలాగ అనుకొంటే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మ పరమైనవి కావచ్చు. శాస్త్రీయతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాల పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా మేలుకుందాం ఋషులు పెద్దలు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.